parlakamidi
పూర్వం మేము ఈ ఊరినిపర్లక మిది అనే వారిమి . దాన్ని ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం పర్లాఖ ముండి అంటోంది
ఇక్కడ Centurion university అని ఒక university ఉంది . ఇక్కడ నా పాత సహోద్యోగులు కొంతమంది పనిచేస్తూ తగినంత మంది ఉపాధ్యాయులు లేక నాచేత పాఠం చెప్పించటానికి ఆహ్వానించారు
ఊరు చాలా బావుంటుంది . తూర్పు కనుమల సహజ అందాలు చూడవచ్చు ఇక్కడ గజపతులు పాలించారు. గిడుగు రామ మూర్తి పంతులు గారు జీవించారు.
ఇక్కడ మహేంద్ర గిరి నుంచి వచ్చే నది మహేంద్ర తనయ లేక తనయా ఉన్నది తనయ అంటే కొడుకు తనయా అంటే కూతురు . తెలుగు లో తనయుడు తనయ అనటము వల్ల నది ఎవరి పేరో తెలియదు
గజపతుల అతిధి గృహం చూసాను
ఆ నది ఆంధ్ర నీ ఒరిస్సా నీ వేరు చేస్తుంది . నది పక్కన ఉన్న తెలుగు ఊరు పాత పట్నం . అక్కడ పురాతన నీల కంఠ ఈశ్వర ఆలయం ఉంది
నిలమని దుర్గ ఆలయం ఉంది ఇఇవిడ పార్వతి అప్పచేల్లెలలు అందరిలోనూ పెద్దదని చెప్పారు. చాల పవిత్రమైన ఆలయం ప్రతి దినం చాలా మంది భక్తులు పూజ చేస్తూ ఉంటారు
పర్లాకిమిడి, బరంపురం, చెన్నపట్నం, తిరుత్తణి, బళ్ళారి, … ఇవన్నీ ఆంధ్రదేశ పాలన నుండి తాప్పించుకున్న ఒకనాటి తెలుగు ప్రదేశాలు. భాష కూడా చాలావరకు కనుమరుగయింది. గాలి జనార్దన రెడ్డి గారి దయవలన బళ్ళారి, జాన్మోహన్ రెడ్డి దయ వలన బెంగుళూరు మన వార్తలలోనికి ఎక్కాయి.మీరు పర్లాకిమిడిని గిడుగు వారిని కబుర్లలోనికి తెచ్చారు. ఢన్యవాదాలు.
V V S Sarma
August 28, 2012 at 6:33 am
మహేంద్ర తనయ – సంస్కృతములో తనయా యే. నదులు స్త్రీలు. సాగరుడు వారి పతి. బ్రహ్మపుత్ర ఒకటే పురుష వాచకము. బంగ్లాదేశ్ లో అసోం కలసిపోయాక, చైనాలో త్సాంగ్ పో, ఇబ్రహీం – కా – బచ్చా అవుతుందేమో
V V S Sarma
August 28, 2012 at 7:13 am