మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన 5 మన చరిత్ర
మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన
5 మన చరిత్ర ( కొనసాగింపు -7)
కల్హణుడు :
రాజతరంగిణి వ్రాసిన కల్హణుడు శాలివాహన శకం 1070 కి అంటే సా. శ . 1148
చెందిన వాడు . అతను కాశ్మీరు రాజులలో ఒకడైన ఒకటవ గోనందుడు భారతకాలం లో లౌకికాబ్దం బలరాముడు చేత చంపబడ్డాడని , ఒకటవ గో నందుడికి 3 వ గోనందుడికి మధ్య 52 రాజులు 1266 సంవత్సరాలు పరిపాలించారని ( ఒక ఉజ్జాయింపు లెక్క ) , తనకి 3 వ గోనందుడికి మధ్య 2330 సంవత్సరాలు ( ఆధారం తెలియదు ఉజ్జాయింపు లెక్కే అనుకుంటాను ) ఒక వార ఉన్నదని వ్రాసాడు అంటే బలరాముడు ఒకటవ గొనందుడిని చంపిన సంవత్సరం సా. శ . పూ. 2448 . అతని లెక్క ప్రకారం భారత యుద్ధం జరిగినది ఉజ్జాయింపుగా సా. శ . పూ . 2550. అతని ప్రకారం కలి, ఒకటవ గొనందుడు మరణానికి ముందు 653 సంవత్సరాలకి పూర్వ మొదలైంది అంటే సా. శ. పూ. 3101
బౌద్ధ ఆరామాలని ‘ హిందువులు ‘ ధ్వంసం చేసా రని మనం వింటూ ఉంటాం . బౌద్ధులు , బౌద్ధ రాజుల పాలన లో కాశ్మీరం లో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేశారని ,కల్హణుడు వ్రాయటం గమనార్హం .
శాతకర్ణులు :
శాతకర్ణులు బౌద్ధులు. వారి తరవాత పరిపాలించిన ‘హిందూ’ రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద ప్రారంభమైన శకాన్ని పట్టించుకోలేదని నమ్మటం సులభం విక్రమాదిత్యుడి కాలం కి చెందిన వరాహ మిహిరుడు తన కాలంలోవాడకం లో ఉన్న శకం భారత యుద్ధానంతరం 2526 సంవత్సరాలకి మొదలైంది అని చెప్పాడు అంటే సా . శ . పూ . 612 లో మొదలైంది అన్నమాట . అది శాతకర్ణుల శకం అయి ఉంటుంది అన్నది నా ఊహ .
శాతకర్ణి శకానికి, శాలివాహన శకానికి మధ్య ఉన్న తేడా 690 సంవత్సరాలు . కల్హణుడు, ఆల్ బెరునీ లు ఈ రెండు శాకాలని ఒకటిగా తీసుకోవటం వలన మన చరిత్రకి సంబంధించిన తేదీల నిర్ణయం లో 700 సంవత్సరాల గందర గోళం ఏర్పడింది అని నా ఊహ .
మెగస్తనీస్( సా . శ . పూ. 350 చుట్టుపట్ల ) ప్రకారం ఆంధ్ర రా జులకి 30 కోట లు ( అందులో దొరికిన ధూళికట్ట ఒకటి )పెద్ద సైన్యం ఉన్నాయి . శాతకర్ణులు ఆంధ్రులు . బహుశ వారు సా. శ . పూ. 800 నుంచి 380 వరకు మగదని పాలించి ఉంటారు.
కల్హణుడు తనకి 3 గోవిందుడి మధ్య ఉన్నఉన్న కాలవ్యవధి ని 2330 సంవత్సరాలుగా ఎలా లెక్క కట్టడో తెలియదు . ఆ కాలం 3000 సంవత్సరాలు అయినా అవవచ్చును .
వరాహ మిహిరుడు:
ఇతను విక్రమార్కుడి కాలం వాడు . అది యదార్థ సమాచారం . అందుచేత నేను అతని రచన కాలం సా. శ .పూ . 60-70 ల మధ్య కాలం గా ఊహిస్తున్నాను .
ఆహార్ గణాలు లెక్క పెట్టె ఆధార కాలం తానున్న శక కాలం లోంచి 427 తీసి వేస్తే వస్తుంది అని మాత్రమే వరాహ మిహిరుడు వ్రాసాడు .దానికి భాష్యం చెప్పిన వారు అతని కాలం 427+ 78 ( సా. శ . 505 ) అని చెప్పారు . ఇది విస్తరించాలంటే కరణ గ్రంథాల గురించి చెప్పాలి . కరణ గ్రంథాలలో సృష్టి మొదలైనప్పటినుచి అయిన పగళ్లు లెక్క కట్టటం ఉంటుంది. ఉదాహరణకి సా. శ .పూ. 3102 ఒక ఆధార సంవత్సరం . మరోటి సా. శ . 1900 . అతను చెప్పిన ఆధార సంవత్సరం శాతకర్ణి శక సంవత్సరం542 – 552 ల మధ్యది అయి ఉండ వచ్చు ఇది ఊహ మాత్రమే .
మహా గుప్తులు :
వీరు శాతకర్ణులకి ప్రమర వంశీయులకు మధ్య కాలం లో మగధ ని పాలించి ఉంటారు ఆంటే వీరు సా శ .పూ . 380 కి 100 కి మధ్య పాలించిన వారు అయి ఉంటారు . వ్ గుప్తా చంద్ర గుప్తుడు అలెగ్జాండర్ కి సమకాలీకుడై ఉండ వచ్చు
మన చరిత్రలో సా. శ . పూ . 800 నుంచి సా . శ . 78 వరకు
అతి గందర గోళానికి చెందిన కాలం
ఈ కాలం గురించి ఎవరు వ్రాసినా యదార్థ సమాచారం తక్కువా ఊహ ఎక్కువా .
ఇది నా ఊహ.
( మన ప్రాచీన చరిత్ర పై నా అవగాహన వ్రాయటం పూర్తి అయింది )
Leave a Reply